హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కరోనా ఆపత్కాలంలో అభాగ్యులు, అనాథలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రభు త్వ, ప్రైవేటు నిలయాల్లో ఉన్న అనాథలు, అన్నార్థుల కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో దాదాపు 400 చైల్డ్ కేర్ సెంటర్లలో ఉన్నవారి యోగక్షేమాల బాధ్యతను సర్కారు నెత్తికెత్తుకున్నది. ప్రతి కేంద్రంలో ప్రత్యేక క్వారంటైన్, ఐసొలేషన్ రూంలను ఏర్పాటుచేసింది. సిమ్టామాటిక్, అసిమ్టామాటిక్ దశల్ని పసిగట్టేందుకు తగిన వసతులు కల్పించింది. కరోనా పాజిటివ్ అని తేలితే తక్షణమే వారికి చికిత్స చేయించేందుకు సదుపాయా లు కల్పించింది. హైదరాబాద్ అమీర్పేటలోని నేచర్క్యూర్ హాస్పిటల్, రామంతాపూర్లోని ఆయుర్వేద హాస్పిటల్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేసింది. వివిధ హోమ్లలోని పిల్లలను వీటిలో చేర్చేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ అన్ని ఏర్పాట్లుచేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమయ్యామని శాఖ పత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ నమస్తే తెలంగాణకు చెప్పారు. రాష్ట్రంలో ఏ హోమ్లో ఉన్నవాళ్లకు ఇబ్బంది అనిపించినా, కరోనా పాజిటివ్ అని తేలినా.. సాయం కోసం కొవిడ్కేర్ హెల్ఫ్లైన్ ఫోన్నంబర్ 040-23733665ను సంప్రదించాలని సూచించారు.