హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మొదలైన పోటీలను రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. హ్యాండ్బాల్ పోటీల్లో జీజీహెచ్ఎస్ స్కూల్ 2-0తో హోలీమేరీపై, చిరాక్ స్కూల్ 4-1తో వైడీ క్లబ్పై గెలిచి శుభారంభం చేశాయి. వాలీబాల్ మ్యాచ్ల్లో హోలీ మేరీ, రాజ్భవన్ స్కూల్ విజయాలు సాధించాయి. కబడ్డీలో కేకే క్లబ్ 13 పాయింట్లతో ఓబుల్ రెడ్డిపై గెలువగా, ఓబుల్రెడ్డి 41 పాయింట్లతో సెయింట్ ఫ్రాన్సిస్ను ఓడించింది. ప్రారంభ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.