దుబాయ్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న పోటీలలో నలుగురు భారత బాక్సర్లు సెమీస్కు చేరారు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన క్వార్టర్స్లో ఏడుగురు బాక్సర్లు బరిలోకి దిగగా వారిలో నలుగురు సెమీఫైనల్స్కు చేరారు. సెమీస్కు చేరినవారిలో జైదీప్ రావత్ (71 కిలోలు), వన్షజ్ (63.5 కిలోలు), దక్ష్ సింగ్ (67 కిలోలు), సురేశ్ విశ్వనాథ్ (48 కిలోలు) ఉన్నారు.