హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి గవర్నర్ కొవిడ్ టీకా వేయించుకోనున్నారు. టీకాపై గిరిజనుల్లో ఉన్న అపోహలు తొలగించే నిమిత్తం గవర్నర్ కేసీ తండాలో రెండో డోసు వేయించుకోవాలని సంకల్పించారు. వ్యాక్సినేషన్లో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ అన్నారు. గిరిజన ఆవాసాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలని పేర్కొన్నారు.