రవీందర్ పాల్ సింగ్,ఎమ్కే కౌషిక్ మృతి
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు మాజీ ఆటగాళ్లు రవీందర్ పాల్ సింగ్ (60), ఎమ్కే కౌషిక్ (66) కరోనాతో మృతిచెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన రవిందర్ పాల్ సింగ్.. గత రెండు వారాలుగా లక్నోలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. మరోవైపు 1980 ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన జట్టులోనే సభ్యుడైన కౌషిక్ కూడా కొవిడ్-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. అర్జున, ద్రోణాచార్య అవార్డులు అందుకున్న కౌషిక్.. భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్గానూ వ్యవహరించారు. వీరి మృతి పట్ల కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.