టోక్యో : పారాలింపిక్స్లో తొలి స్వర్ణం ఆస్ట్రేలియాను వరించింది. ఆ దేశానికి చెందిన సైకిలిస్టు పేయిగ్ గ్రెకో.. 3 వేల మీటర్ల మహిళల వ్యక్తిగత ఈవెంట్లో విజయం సాధించి స్వర్ణం నెగ్గింది. మహిళల క్లాస్1-3 కేటగిరిలో పోటీ పడిన గ్రెకో.. గతంలో తాను సాధించిన రికార్డును తానే తిరగరాసింది. 3 నిమిషాల 50.81 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి పసిడిని ముద్దాడింది. ఇక ఇదే పోరులో వాంగ్ జియోమి (చైనా) రజతం నెగ్గగా డెనిస్ షిండ్లర్ (జర్మనీ) కాంస్యం సాధించింది.