ముంబై: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 37/4తో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత దూకుడు పెంచాడు. రాహుల్ తెవాటియా వేసిన 11వ ఓవర్లో పంత్ హ్యాట్రిక్ ఫోర్లు బాది 20 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్గా పంత్కిదే మొదటి హాఫ్సెంచరీ కావడం విశేషం. 12 ఓవర్లకు ఢిల్లీ 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. ప్రస్తుతం పంత్(50), లలిత్ యాదవ్(12) క్రీజులో ఉన్నారు.