లుసానె: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్లు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఈ నెల 15,16న స్పెయిన్తో జరుగాల్సిన మ్యాచ్లతో పాటు.. 23, 24న జర్మనీతో ఆడాల్సిన మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు ఎఫ్ఐహెచ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8-9న లండన్ వేదికగా భారత జట్టు గ్రేట్ బ్రిటన్తో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా.. కొవిడ్-19 కారణంగా వాటిని వాయిదా వేసిన విషయం తెలిసిందే.