అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తలరించారు. మొదట ఆర్టీసీ బస్సును గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. అనంతరం ఆ బస్సును ఎదురుగా వచ్చిన మరో బస్సు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. దీంతో రెండు బస్సుల్లోని ప్రయాణికులు గాయపడ్డారని చెప్పారు. రోడ్డు పక్కన చెత్త తగులబెట్టం వల్ల దట్టమైన పొగలు కమ్ముకున్నాయని, ఈ నేపథ్యంలో దారి కనిపించక వాహనాలు ఢీకొన్నాయని వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్