యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఏప్రిల్ 3 వరకు కొనసాగిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్య అన్నదానం కూడా అప్పటివరకు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 3 వరకు భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.