న్యూఢిల్లీ, జూన్ 25: దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేశారు. దేశ రాజధానిలోని సఫ్ధర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. శుక్రవారం రైల్వే స్టేషన్కు చేరుకున్న కోవింద్కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ స్వయంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి స్వగ్రామానికి వెళ్లారు. కాగా, 2006లో అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు రైలులో ప్రయాణించారు. ఆ తర్వాత 15 ఏండ్లకు కోవింద్ రైలులో ప్రయాణించారు. దేశ చరిత్రలో భారత తొలి ప్రథమ పౌరుడు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు రైలులో ప్రయాణించినట్టు రికార్డులు చెబుతున్నాయి.