హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు(మార్చి 24) సాయంత్రం 6 గంటలకు బంద్ కానుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ ను సందర్శించి సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెందినవారితో పాటు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. అదేవింధగా శారీరక అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరిల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఆగస్టు,2021 నాటికి కనిష్ఠ వయస్సు 21 ఏళ్లుగా గరిష్ఠ వయస్సు 32 ఏళ్లుగా పేర్కొన్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 27 జూన్,2021న జరగనుంది. ఈ పరీక్ష ద్వారా 712 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేస్తోంది.