ఈక్వెస్ట్రియన్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన ఫవాద్ మీర్జా ప్రయాణం ముగిసింది. ఈ ఈవెంట్లో పతకం సాధిస్తాడని ఆశలు రేకెత్తించిన ఫవాద్.. డ్రెస్సేజ్, క్రాస్ కంట్రీ, జంపింగ్ విభాగాలలో ఫైనల్కు అర్హత సాధించినా విజయం మాత్రం వరించలేదు. మూడు విభాగాల్లో కలిపి ఫవాద్కు 59.60 పెనాల్టీలతో 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ మూడు రౌండ్లలో అతి తక్కువ పెనాల్టీలు సాధించినవారు విజేతలుగా నిలుస్తారు. సోమవారం నాటి ఈవెంట్లో జర్మనీకి చెందిన క్రజ్వెస్కీ (26 పెనాల్టీలు) స్వర్ణం సాధించగా గ్రేట్ బ్రిటన్ ఈక్వెస్ట్రియన్ మెక్ ఈవెన్ (29 పెనాల్టీలు) రజతం సాధించాడు. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత పోటీలలో భారత్ తరఫున ఫైనల్కు చేరిన తొలి ప్లేయర్గా ఫవాద్ రికార్డు సృష్టించాడు. మరోవైపు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ 200మీటర్ల హీట్స్లో 23.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంతో సరిపెట్టుకోగా.. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్లో ప్రతాప్ సింగ్, సంజీవ్ ఫైనల్కు చేరడంలో విఫలమయ్యారు.