హైదరాబాద్ : ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు. కరోనా తర్వాత కొందరు బ్లాక్ఫంగస్ బారినపడుతున్నారని ఆయన వెల్లడించారు. కోఠి ఈఎన్టీ దవాఖానలో 240కిపైగా బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రోజూ 20 బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అన్నీ ప్రభుత్వ దవాఖానల్లో మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.