రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ఓ నకిలీ దరఖాస్తు వెలుగుచూసింది. ఏకంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఓ వ్యక్తి దరఖాస్తు చేశాడు. తండ్రి పేరును సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు. అయితే ఈ దరఖాస్తును అధికారులు షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం మరో వింత. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ తంతు జరిగింది. సీఎస్వీటూయూ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ డిగ్రీ చేశానని ఓ వ్యక్తి ధోనీ పేరిట దరఖాస్తు చేశాడు. ఆ అప్లికేషన్ షార్ట్లిస్ట్ అయి ఇంటర్వ్యూ వరకు వచ్చింది. అయితే ఈ నెల 2న జరిగిన ఇంటర్వ్యూకి ఆ వ్యక్తి రాకపోవడంతో విషయమేంటని అధికారులు ఆరా తీయగా నకిలీ దరఖాస్తు అనే విషయం బయటికి వచ్చింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా బయటికి పొక్కడంతో వైరల్గా మారింది. దీంతో ఆ నకిలీ దరఖాస్తుదారుడిపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.