జహీరాబాద్, మే 7 : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో రసాయనాల పిచికారీ, ఇంటింటి సర్వే చేసి కరోనా బాధితులకు మందులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం జహీరాబాద్ డివిజన్లో అధికారులు ఇంటింటి సర్వే చేయడంతోపాటు రసాయన మందులు పిచికారీ చేశారు. వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తున్నదో అంతే వేగంగా నివారించేందుకు ఇంటింటా సర్వే చేసి రోగులను గుర్తించి మందులు అందజేస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే అక్కడికక్కడే మందులు అందజేస్తున్నారు. అత్యవసరమై న వారిని సర్కారు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను సైతం కొవిడ్ చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. జహీ రాబాద్ ఆర్డీవో రమేశ్బాబు పర్యవేక్షణలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
లక్షణాలుంటే మెడికల్ కిట్లు అందించాలి
ఇంటింటా సర్వే నిర్వహించి ఎ వరికైనా కరోనా లక్షణాలు ఉంటే మెడికల్ కిట్లు అం దజే యాలని ఇన్చార్జి తహసీల్దార్ రాజు సర్వే బృందం సభ్యులకు సూచించారు. మండల పరిధిలోని సిం గితం, రాయికోడ్ ఇంటింటా ఆరోగ్య సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మాల్లో ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే దవాఖానకు రిఫర్ చేయాలన్నారు. మండలంలో ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశ కార్యకర్తలు ఇంటింటా సర్వే నిర్వహించి వివరా లు సేకరించారు. సర్వేలో ఎంపీడీవో వెంకటేశం, ఎంపీవో శ్రీకాంత్గౌడ్, వీఆర్వో శంకర్, అంగన్ వాడీ టీచర్ సక్కుబాయి పాల్గొన్నారు.
మండలంలోని…
కరోనా వైరస్ను నివారించేందుకే ఇంటింటా ఆరోగ్య సర్వే చేస్తున్నామని ఎంపీడీవో షాజిలోద్దీన్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులపాటు సర్వే నిర్వ హించి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తిం చి మెడికల్ కిట్లు అందజేస్తామన్నారు. సర్వేలో పంచా యతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పకడ్బందీ చర్యలు…
కరోనా కట్టడికి ఇంటింటా సర్వే చేస్తున్నట్లు డాక్టర్ మాజీద్ తెలిపారు. మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు చీలేమాడి, చిల్కేపల్లి, చీల్లపల్లి, కప్పాడ్, కుప్పానగర్, కక్కర్వాడ తదితర గ్రామాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు కలిసి ఇంటింటా సర్వే నిర్వహించారు. జర్వంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతుందన్నారు. అందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కొవిడ్ కేంద్రంలో మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు షేక్ సలీమ్, టీఆర్ఎస్ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నారు. సర్వేలో వైద్య సిబ్బంది మార్త, శాంతమ్మ నక్షేత్రం, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటా ఆరోగ్య సర్వే
హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. కరోనా లక్ష్యణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా బారినపడ్డవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.