యువ అథ్లెట్కు మంత్రి దయాకర్రావు అభినందన
హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో మెరిసిన యువ స్ప్రింటర్ చెరిపెల్లి కీర్తనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో గూడురుకు చెందిన కీర్తనను మంత్రి సన్మానించారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న కీర్తన భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కీర్తన తల్లిదండ్రులు నాగమణి, కుమారస్వామిని అభినందించిన మంత్రి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడురు సర్పంచ్ కొమురయ్య, పుల్లయ్య, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు