నర్సాపూర్ రూరల్, మే 7 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు వరమని, పేదల అభ్యున్నతి కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ తహసీల్ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన 158 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమన్నారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలను నిలిపి వేయకుండా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. కరోనాకు బయపడకుండా ధైర్యంతో ఉండాలని ప్రజల కు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. అనంతరం రంజాన్ పం డుగ సందర్భంగా గిఫ్ట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మర్ రాజు యాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ నయిం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, కౌన్సిలర్ అశోక్గౌడ్, తహసీల్దార్ తిరుమలరావు, లబ్ధ్దిదారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు..
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. నర్సాపూర్లోని ఐబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రైస్మిల్లులలో పాత స్టాక్ హమాలీల కొరత కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని, రైతులు అధైర్య పడవద్దని సూచించారు. వర్షం పడి రంగుమారినా రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు.
సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు అందజేత
నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో చిలిపిచెడ్, చిట్కుల్ గ్రామాలకు చెందిన లబ్ధ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్లకు ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు. చిలిపిచెడ్కు చెందిన వడ్ల ఆంజనేయులుకు రూ.50,500, చిట్కుల్కు చెందిన పోచమ్మకు రూ.16 వేలు, లలితకు రూ.34 వేలు, నీలమ్మకు రూ.27,500 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మీదుర్గారెడ్డి, గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, నేతలు నారాగౌడ్, దుర్గానాయక్ పాల్గొన్నారు.
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గోమారం గ్రామం లోని 111 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, తహసీల్దార్ భానుప్రకాశ్ ఉన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మండలంలోని రేగోడ్, ఆర్.ఇటిక్యాల గ్రామా ల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సర్పంచ్లు నర్సింహులు, రమేశ్, ఎంపీటీసీ నర్సింహులు అందజేశారు. కార్యక్ర మంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు మోహీజొద్దీన్, పీఏసీఎస్ డైరెక్టర్ నాగేందర్రావు, మాజీ సర్పంచ్ కృష్ణయాదవ్, టీఆర్ఎస్ నాయకులు బాబా, ఆంజనేయులు పాల్గొన్నారు.