జడ్చర్ల, జూలై 5 : జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, కిష్టారం, పోలేపల్లి, ఉదండాపూర్, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి తదితర గ్రామా ల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. అలాగే హరితహారంలో మొక్కలు నా టేందుకు గుంతలను తీశారు. ప్రతి ఇంటికీ మొ క్కలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు రాములునాయక్, నర్సింహులు, సుకన్య, రవీందర్రెడ్డి, సువర్ణ, విజయలక్ష్మి, ఏఈలు రాములునాయక్, నరేందర్గౌడ్ పాల్గొన్నారు.
పచ్చదనం, పరిశుభ్రత పెంచాలి
మూసాపేట(అడ్డాకుల), జూలై 5 : అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని డీఆర్డీవో యాదయ్య సూచించారు. అడ్డాకుల మండలకేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయలక్ష్మి, ఏపీఎం విష్ణుచారి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి
గండీడ్, జూలై 5 : ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కల చొప్పున నాటి పెంచాలని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి కోరారు. మండలంలోని కొం డాపూర్, పగిడ్యాల్, బల్సుర్గొండ గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, పీఆర్ ఏఈ రాబర్ట్, విద్యుత్ ఏఈ వెంకటయ్య, సర్పంచులు రాణి, వనజ, శ్రీనివాస్, ఎంపీటీసీ బాలమ్మ పాల్గొన్నారు.
పాడుబడిన ఇండ్లు తొలగింపు
మూసాపేట, జూలై 5 : పల్లెప్రగతి కార్యక్రమం లో భాగంగా మూసాపేట గ్రామంలో పాడుబడిన ఇండ్లను తొలంగించారు. అదేవింధంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. అలాగే గ్రామస్తులు శ్రమదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ మంజుల, ఎంపీవో సరోజ, పంచాయతీ కార్యదర్శి సంతోషి పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూలై 5 : మండలంలో ని పెద్దాయపల్లి, నామ్యాతండా, వాయిల్కుంటతండా తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించారు. కార్యక్రమాల్లో సర్పంచులు శంకర్, పీర్యానాయక్, గోపీనాయక్, ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మణి, పంచాయతీ కార్యదర్శులు అనిల్కుమార్, బాసునాయక్ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూలై 5 : మండలంలోని నాయినోనిపల్లి, ఇబ్రహీంబాద్, కొనగట్టుపల్లి తదితర గ్రా మాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అలాగే పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సర్పంచులు చిన్న చెన్నయ్య, వసంత, ఎంపీటీసీ పెద్ద చెన్నయ్య, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్కుమార్, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జూలై 5 : మండలంలోని నంచర్ల, ఎల్కిచెరువు తండాలో చేపడుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు దశరథ్, శ్రీనివాస్, ఎంపీవో శంకర్నాయక్, సర్పంచులు అనసూయ, దేవీబాయి. కోఆప్షన్ సభ్యుడు సలీం తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 5 : మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో జయరాం పరిశీలించారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. అదేవిధంగా ఇబ్రహీంనగర్ గ్రామంలో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు రాములు, ఆంజనేయులు, ఎంపీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జూలై 5 : మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. లక్ష్మీపల్లి గ్రామంలో సర్పం చ్ కృష్ణారెడ్డి గ్రామస్తులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదా రంతోపాటు పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించి శుభ్రం చేశారు.
పల్లెలన్నీ హరితమయం కావాలి
మిడ్జిల్, జూలై 5 : హరితహారం కార్యక్రమం తో పల్లెలన్నీ హరితమయం కావాలని ఎంపీపీ కాంతమ్మ అన్నారు. మండలంలోని వెలుగోము ల, అయ్యవారిపల్లి, బోయిన్పల్లి, మిడ్జిల్, వాడ్యాల్, చిల్వేర్ గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమం లో సర్పంచులు సునీతారెడ్డి, మంగమ్మ, నారాయణరెడ్డి, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, నాయకులు బాలస్వామి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.