లండన్: ఇండియా ( India vs England )తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. తొలి టెస్ట్ చివరి రోజు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోణీ కోసం రెండు టీమ్స్ తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. డాన్ లారెన్స్, జాక్ క్రాలీ, స్టువర్ట్ బ్రాడ్ల స్థానంలో మొయిన్ అలీ, మహీద్, వుడ్ టీమ్లోకి వచ్చారు. ఇక ఇండియన్ టీమ్లో గాయపడిన శార్దూల్ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ వచ్చాడు.