న్యూజిలాండ్తో తొలి టెస్టు డ్రా
లండన్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సాగిన మ్యాచ్లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యఛేదనలో ఆదివారం ఐదో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఓపెనర్ డామ్ సిబ్లే (207 బంతుల్లో 60 నాటౌట్) చివరి వరకు నిలువగా.. కెప్టెన్ జో రూట్ (40) రాణించాడు. రోరి బర్న్స్ (25), జాక్ క్రాలీ (2) ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో సిబ్లేకు ఓలీ పోప్ (20) తోడుగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్కు రెండు, సౌథికి ఓ వికెట్ దక్కిం ది. అంతకుముందు 62/2 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లకు 169 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అరంగేట్ర బ్యాట్స్మన్ డెవోన్ కాన్వే ద్విశతకంతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 378 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 275 రన్స్కే ఆలౌటైంది.