సినిమాల పరంగా అగ్ర హీరో చిరంజీవి వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్పై ఉండగానే మరో మూడు చిత్రాల్ని అంగీకరించారు చిరంజీవి. తాజాగా ఆయన వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్బాబుతో తెరకెక్కించిన ‘మహర్షి’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా వంశీపైడిపల్లి తదుపరి సినిమాపై సస్పెన్స్ మాత్రం వీడలేదు. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించినట్లు తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ కథలోని నవ్యత నచ్చడంతో చిరంజీవి సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.