న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్లు తన బౌలింగ్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారని భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు. తాను వేసిన కొన్ని బంతులు స్పిన్ అవుతాయో లేదో తెలియక కేవలం స్వీప్లు, రివర్స్ స్వీప్లకే పరిమితమయ్యారని అన్నాడు. మార్చిలో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో 27 వికెట్లు తీసి ఇంగ్లండ్ను అక్షర్ దెబ్బకొట్టాడు. టీమ్ఇండియా త్వరలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టులు ఆడనున్న నేపథ్యంలో గురువారం ఓ ఇంటర్వ్యూలో అక్షర్ మాట్లాడాడు. టెస్టుల్లో అశ్విన్, జడేజా అద్భుతంగా రాణిస్తున్నారని, అందుకే తనకు అవకాశాలు రావడం లేదని చెప్పాడు.