ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగవ టెస్టు ఉత్కంఠ దిశగా వెళ్తోంది. ఓవల్ మైదానంలో ఆఖరి రోజున భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. ఓపెనర్ హమీద్ 62, రూట్ 8 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. మరో ఓపెనర్ బర్న్స్ 50 రన్స్ చేసి శార్దూల్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. అయితే తొలి సెషన్లో ఇండియా మరో వికెట్ను చేజిక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. హమీద్ 56 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్ను సిరాజ్ వదిలేశాడు. 368 టార్గెట్తో రెండవ ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ .. నాలుగవ రోజు వికెట్ నష్టపోకుండా 77 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తొలి సెషన్లో 27 ఓవర్లలో మరో 54 రన్స్ జోడించి రెండు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ తన విక్టరీ కోసం 63 ఓవర్లలో 237 రన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే 3.76 రన్ రేటు అవసరం ఉంది. మ్యాచ్ ఏ జట్టునైనా వరించే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్లకు ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. రాబోయే రెండు సెషన్లలో .. రసవత్తర పోరు తప్పేటట్టు లేదు.
స్కోర్ బోర్డ్
ఇండియా
ఫస్ట్ ఇన్నింగ్స్ 191 ఆలౌట్
సెకండ్ ఇన్నింగ్స్ 466 ఆలౌట్
ఇంగ్లండ్
ఫస్ట్ ఇన్నింగ్స్ 290
సెకండ్ ఇన్నింగ్స్ 131-2(59 ఓవర్స్)