లీడ్స్: తొలి పోరులో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్.. తిరిగి పుంజుకొని లెక్క సరిచేసింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 45 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (59), మోయిన్ అలీ (36), లివింగ్స్టోన్ (38) రాణించారు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది. రిజ్వాన్ (37) టాప్స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ 3, అలీ, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.