Sports
- Feb 08, 2021 , 14:17:40
VIDEOS
టీ టైమ్.. ఇంగ్లండ్ ఆధిక్యం 360 పరుగులు

చెన్నై: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. నాలుగో రోజు టీ సమయానికి ఆ టీమ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 241 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఓవరాల్గా 360 పరుగుల లీడ్లో ఇంగ్లండ్ ఉంది. అంతకుముందు టీమిండియా 337 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. కోహ్లి సేనను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. ఆ పని చేయని ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇండియన్ టీమ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తోంది. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ బలహీనపడిందన్నది వాస్తవం: కపిల్ సిబల్
- సురభి వాణీ దేవిని గెలిపించుకోవాలి : మంత్రి హరీశ్
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్కు 'చెక్'..నిరాశలో నితిన్
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
MOST READ
TRENDING