చిక్కడపల్లి, మే 17: రజకులకు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ను అందించాలని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. సేవాపరమైన రజక వృత్తిని వ్యాపార దృక్పథంతో చూడకుండా, ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ను అందించి.. అతి తక్కువ ధరకే మీటర్లు ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞాపన చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలం, గ్రామ ప్రాంతాలో ్ల ఎక్కువ మంది రజకులు ఇండ్లలోనే ఇస్త్రీ చేస్తున్నారని.. వీరికి ట్రేడ్ లైసెన్స్ అవసరం లేకుండా సంబంధిత కార్యాయాల నుంచి రజకులు పొందిన రసీదుల ఆధారంగా విద్యుత్ను అందించాలని కోరారు. అలాగే ఆధునిక ల్యాండ్రీలకు కూడా ఉచిత విద్యుత్ను వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కినేని శ్రీనివాస్, కన్వీనర్ మానస గణేశ్, కుమారస్వామి, ఆంజనేయులు, వెంకన్న, రాజు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.