నాటింగ్హామ్: ఇండియాతో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టులోకి గాయపడ్డ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఈ మ్యాచ్కు కాంకషన్ వల్ల మిస్సయ్యాడు. స్పిన్నర్ అశ్విన్ స్థానంలో ఆల్రౌండర్ జడేజాకు స్థానం కల్పించారు. స్పీడ్స్టర్ ఇశాంత్ శర్మకు కూడా తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇండియా పేస్ అటాక్లో సిరాజ్, శార్దూల్లు ఉన్నారు. ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓడిన ఇండియాకు ఈ సిరీస్ కీలకం కానున్నది. ఇంగ్లండ్, ఇండియా మధ్య మొత్తం అయిదు టెస్టులు జరగనున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్కు మూడవ ఓవర్లోనే జలక్ తగిలింది. బుమ్రా బౌలింగ్లో బర్న్స్ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు.