సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్కి అంతరాయం లేని విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంగా మాదాపూర్లో 33 కేవీ స్విచ్చింగ్ స్టేషన్ను నిర్మించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి అన్నారు. బుధవారం మాదాపూర్లోని 132/33 కేవీ సబ్స్టేషన్లో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన 33 కేవీ స్విచ్చింగ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నగరానికి పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకే విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐటీ కారిడార్లో పడుతున్న విద్యుత్ లోడ్ను తట్టుకునేలా స్విచ్చింగ్ స్టేషన్ను నిర్మించామని వివరించారు.