శంకర్పల్లి రూరల్: క్రీడల్లో గుర్రపు స్వారీ భిన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామ శివారులో నాజర్ పోలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన షో జంపింగ్ చాంపియన్షిప్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి గుర్రపు స్వారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఇటువంటి ఆటల పట్ల యువత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడల కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నదన్నారు. ఇటువంటి హార్స్ జంపింగ్ కేంద్రాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కవిత అన్నారు.