ముంబై: ఐపీఎల్లో కొత్త జట్ల కోసం బీసీసీఐ వచ్చే నెలలో ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. వచ్చే సీజన్ నుంచి ఈ సంఖ్య పదికి పెరగనుంది. కొత్త జట్ల కోసం గత నెల 31న బిడ్లను ఆహ్వానించిన బోర్డు.. వచ్చే నెల 5 వరకు వాటిని దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. ‘కొత్త జట్ల కోసం వచ్చే నెల 17న ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తున్నది’ అని ఓ అధికారి తెలిపారు.