కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ షెడ్యూల్ బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 5న జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో మొహమ్మదీన్..ఇండియన్ ఎయిర్ఫోర్స్ జట్టుతో తలపడనుంది. ఆసియాలోనే అతి పురాతన టోర్నీగా పేరొందిన డ్యూరాండ్ కప్ను భద్రతా దళాలతో పాటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నది. ఇందులో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. గ్రూపు-ఎలో బెంగళూరు యునైటెడ్, ఇండియన్ ఎయిర్ఫోర్స్, సీఆర్పీఎఫ్, మొహమ్మదీన్ ఉన్నాయి. గ్రూపు-బిలో ఎఫ్సీ గోవా, జంషెడ్పూర్ ఎఫ్సీ, సుదేవా ఢిల్లీ ఎఫ్సీ, ఆర్మీ గ్రీన్ ఫుట్బాల్ టీమ్, గ్రూపు-సిలో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్, కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ ఎఫ్సీ, ఇండియన్ నేవీ టీమ్, గ్రూపు-డిలో హైదరాబాద్ ఎఫ్సీ, అస్సాం రైఫిల్స్, ఆర్మీ రెడ్, గోకులమ్ కేరళ ఫుట్బాల్ క్లబ్ ఉన్నాయి.