న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా తన చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన నీరజ్.. శనివారం ఆ ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. ‘ఈ రోజు నా చిన్ని కల నెరవేరింది. మా అమ్మానాన్నలు మొదటిసారి ఫ్లైట్ ఎక్కారు’అని ట్వీట్ చేశాడు. కర్ణాటకలో జరుగుతున్న ఓ కార్యక్రామానికి హాజరయ్యేందుకు నీరజ్ తన తల్లిదండ్రులు సరోజ్ దేవి, సతీశ్ కుమార్తో కలిసి విమానంలో ప్రయాణించాడు.