దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిలిచింది.బరాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించి ఆ పాత్రకు వన్నెతెచ్చారు. ఇక కొన్నాళ్లుగా వైఎస్ జగన్ బయోపిక్కి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతుంది.
యాత్ర 2 పేరుతో వైఎస్ జగన్ బయోపిక్ రూపొందనున్న ప్రచారం జరుగుతుండగా, ఈ సినిమాకు మహి వి రాఘవ తెరకెక్కించనున్నాడు. వైఎస్ జగన్ పాత్రను నాగార్జున పోషిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం స్కామ్ 2 ఫేం ప్రతీక్ గాంధీ .. జగన్ పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ పోలికలతో ఈ గుజరాతీ నటుడు ఉండడంతో ఆయనను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన రానుంది. యాత్ర-2 సీఎం జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తండ్రి చనిపోయిన తరువాత జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఆ తరువాత పాదయాత్ర చేపట్టి సీఎం ఎలా అయ్యారన్న కోణంలో ఈ కథ ఉండబోతున్నట్టు సమాచారం.