టోక్యో: ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ ( hockey ) టీమ్ సెమీఫైనల్లో బెల్జియంతో ఓడిన విషయం తెలుసు కదా. ఈ ఓటమిపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓడిపోయామని బాధపడుతూ కూర్చునేంత సమయం లేదని, తాము బ్రాంజ్ మెడల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతామని మన్ప్రీత్ అన్నాడు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన మన పురుషుల హాకీ టీమ్.. సెమీస్లో మూడు క్వార్టర్ల పాటు బాగానే ఫైట్ చేసినా.. చివరి క్వార్టర్లో చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.
నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కచ్చితంగా గెలవాలనే వచ్చాం కానీ గెలవలేకపోయాం. ఇప్పుడు తర్వాతి బ్రాంజ్ మెడల్ మ్యాచ్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ మెడల్ గెలవాల్సిందే అని మన్ప్రీత్ అన్నాడు. చాలా కాలం తర్వాత సెమీఫైనల్ చేరడం గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు తర్వాతి మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది. దానిపై దృష్టి సారించాలి. కనీసం దేశం కోసం బ్రాంజ్ మెడలైనా గెలుస్తాం అని మన్ప్రీత్ అన్నాడు.