దుబాయ్: ప్రపంచ కప్ సాధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి కానుకగా ఇవ్వాలని భారత ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పిలుపునిచ్చాడు. టీ20 ప్రపంచకప్ ప్రారంభం సందర్భంగా రైనా ఆదివారం మాట్లాడుతూ.. ‘కోహ్లీ కోసం ఆడి ప్రపంచకప్ గెలవండి. కెప్టెన్గా ఆఖరి టోర్నీ కావడంతో కోహ్లీకి ఇదెంతో ముఖ్యం. మనం సాధించగలమని అందరూ విశ్వాసంతో కోహ్లీ వెంట నిలవాలి. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఈమెగా టోర్నీలో భారత్కు అనుకూలిస్తుందని నా అభిప్రాయం. టాప్-3లోనే భారత విజయం దాగి ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ 15 ఓవర్లు నిలబడితే విజయావకాశాలు ఎక్కువుంటాయి. మిడిలార్డర్లో రిషబ్ పంత్ కీలకం. యూఏఈ పిచ్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ సరిగ్గా సరిపోతాయి’ అని వివరించాడు.