దుబాయ్: క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ కొత్త ఫోటోను పోస్టు చేశాడు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ క్రికెటర్ .. హోటల్ రూమ్లో కసరత్తు చేస్తున్న ఫోటోను ట్యాగ్ చేశాడు. అయితే ఆ ఫోటోకు ఓ ప్రేరణాత్మక సందేశాన్ని జత చేశాడు. ఇటీవల పర్సనల్ లైఫ్లో దెబ్బతిన్న శిఖర్ ధావన్.. ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చే రీతిలో పోస్టు ఉన్నట్లు తెలుస్తోంది.
భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన ధావన్.. తన పోస్టులో మోటివేషనల్ మెసేజ్ ఇచ్చాడు. ఉన్నతంగా ఆలోచించేవాళ్లు, కష్టపడేవాళ్లు, మనస్పర్థలను పక్కనపెట్టేవాళ్లకే అదృష్టం కలిసి వస్తుందని, వాళ్లనే ప్రజలు ప్రేమిస్తారన్న అర్థం వచ్చే రీతిలో ధావన్ తన పోస్టులో తెలిపారు. ధావన్ చేసిన పోస్టుకు మాజీ క్రికెటర్ హర్భజన్ నిజం చెప్పావంటూ కామెంట్ చేశాడు. నిజానికి శిఖర్ ధావన్, అయేషా లవ్ స్టోరీలో భజ్జీ కీ రోల్ ప్లే చేశాడు. ఫేస్బుక్లో శిఖర్, ఆయేషాలకు హర్భజన్ మ్యూచువల్ ఫ్రెండ్. ఏదేమైనా ఐపీఎల్లో మాత్రం ధావన్ తన సత్తా చాటుతున్నాడు. ఈ యేటి సీజన్లో అతను 9 మ్యాచుల్లో 422 రన్స్ చేశాడు.