హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి 68వ సీనియర్ అంతర్జిల్లాల కబడ్డీ చాంపియన్షిప్లో మేడ్చల్, రంగారెడ్డి జట్లు క్వార్టర్స్లోకి దూసుకెళ్లాయి. తొలుత జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్లో రంగారెడ్డి 38-3 తేడాతో వనపర్తిపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రంగారెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఏకపక్షంగా ప్రత్యర్థిని మట్టికరిపించింది. దూకుడైన రైడింగ్కు తోడు పటిష్టమైన డిఫెన్స్తో వరుస పాయింట్లు కొల్లగొట్టింది. మరోవైపు పురుషుల ప్రిక్వార్టర్స్లో మేడ్చల్ 62-22 తేడాతో భూపాలపల్లిపై గెలిచింది. మూడో రోజు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్రెడ్డి ప్లేయర్లను పరిచేయం చేసుకొని మ్యాచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.