తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, మార్చి 28 : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు టీఆర్ఎస్తో కలిసి వచ్చే సంఘా లు, పార్టీలతో కలిసి మరో ఉద్యమాన్ని చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం సాయం త్రం హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీలు పసునూరి దయాకర్, డాక్టర్ బండా ప్రకాశ్తో కలిసి మాట్లాడారు. సమైక్యాంధ్ర, బీజేపీ పాలనలో కాజీపేట జంక్షన్ వెలవెలబోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బ య్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తినప్పటికీ ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అం టూ కాలయాపన చేసిన బీజేపీ అసలు స్వరూ పం బయటపడిందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్కు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరిగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం రద్దు చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నదన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్ట ర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఉద్యమాలు నడుస్తున్నాయని, పీవీ నర్సింహారావు ఎంపీ అయిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు షిఫ్ట్ చేశారన్నారు. కేంద్రం లో రైల్వే మంత్రులు ఏ రాష్ర్టానికి చెందిన వారు ఉంటే ఆ రాష్ట్రాలకు మాత్రమే రైల్వే ప్రాజెక్టులు వెళ్లాయన్నారు. దక్షిణమధ్య రైల్వే నుంచి ఇండియన్ రైల్వేకు ఎక్కువ రెవెన్యూ వస్తున్నదన్నారు. తెలంగాణ చెల్లించిన మొత్తం పన్నుల్లో 40 శాతం మాత్రమే రాష్ట్రానికి నిధుల రూపంలో కేంద్రం ఇస్తున్నదన్నారు. దేశంలో 30 శాతం పసుపు తెలంగాణలోనే సాగవుతున్నదన్నారు. రైల్వే కోచ్ ఫాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రానికి రాబో యే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో కేంద్ర విఫలమైందన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు కేంద్రంపై తాము చేస్తున్న పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ సుందర్రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
పొకో F3, పొకో X3 ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్