న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక స్థితిగతులు చెదిరిపోయాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం భారత్ కరోనా రెండో వేవ్తో పోరాడుతున్నది. దీని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది.
కానీ ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్ట సాధ్యం అని కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. వచ్చేనెల నుంచి ఆర్థిక రంగ కార్యకలాపాలు తిరిగి కోలుకుంటాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నదని చెప్పారు.
ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఒకవేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైతే.. ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా నిలుస్తుందని కేవీ సుబ్రమణ్యం తెలిపారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో విభిన్న రంగాల్లో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగులుగా మారారు. అయితే, ప్రతి రోజూ మూడు షిప్టుల్లో చేస్తేనే డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేవీ సుబ్రమణ్యం తెలిపారు.
కానీ ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాలన్న ఆకాంక్ష ఉండొచ్చునని, కానీ అది అసాధ్యం అని కేవీ సుబ్రమణ్యం తెలిపారు. ద్రవ్యలోటు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలపై మహమ్మారి ప్రభావం చూపుతుందన్నారు.
2020-21లో మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 9.3 శాతంగా నమోదైందన్నారు. కానీ 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశామని సుబ్రమణ్యం అన్నారు. జీడీపీ 7.3 శాతానికి పడిపోయింది.
దేశీయ స్టాక్మార్కెట్లలో రికార్డు స్థాయి గ్రోత్ కొనసాగుతుండటంతో ఎకానమీ సజావుగానే ఉంటుందని ఇన్వెస్టర్లు విశ్వాసంతో ఉన్నారని కేవీ సుబ్రమణ్యం తెలిపారు.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం