న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు మెంటార్గా వ్యవహరించనున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. అందుకుగానూ ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్నాడు. పొట్టి క్రికెట్లో అపార అనుభవం ఉన్న మహీ సేవలు వినియోగించుకునేందుకు బీసీసీఐ అతడిని సలహాదారుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం గంగూలీ స్పందిస్తూ.. ‘జట్టుకు మెంటార్గా ఉండేందుకు ధోనీ ఎలాంటి డబ్బు తీసుకోవడం లేదు’ అని చెప్పాడు. భారత్ వేదికగా జరుగాల్సిన ప్రపంచకప్ కరోనా మహమ్మారి కారణంగా యూఏఈ, ఒమన్లో నిర్వహిస్తుండగా… ఈనెల 17 నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. 24న తొలిపోరులో దాయాది పాకిస్థాన్తో టీమ్ఇండియా కప్ వేట ప్రారంభించనుంది.