చెన్నై: కూల్ మాన్.. క్రికెట్ మాంత్రికుడు.. అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా గుడ్బై చెప్పనున్నారా? అంటే సమాధానం వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారధి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడక పోవచ్చు. ఈ సంగతిని జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా వెల్లడించారు.
ఒకవేళ, ఐపీఎల్-2021 టైటిల్ను గెలుచుకుంటే వచ్చే సీజన్లోనూ ఆడాలని ధోనీని కన్విన్స్ చేస్తామని సురేశ్ రైనా శనివారం అన్నారు. సీఎస్కే ఓటమి పాలైతే ఐపీఎల్ లీగ్ నుంచి కూడా ధోనీ రిటైర్మెంట్ ఖరారైనట్లైనని తేల్చేశారు. 2020లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ధోనీ రిటైరైన సంగతి తెలిసిందే.
ఒకవేళ ధోనీ ఆడకుంటే తాను కూడా ఆడక పోవచ్చునని సురేశ్ రైనా తెలిపారు. 2008 నుంచి మహీతో కలిసి ఆడుతున్నానని గుర్తు చేశారు. తన భాగస్వామి మాత్రమే లీగ్ను వీడతారన్నారు. ప్రస్తుత సీజన్లో సీఎస్కే గెలిస్తే.. జట్టుతోనే ఉండాలని కోరతానన్నారు. ధోనీతోపాటు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ను వీడారు.
మరో నాలుగైదేండ్లు క్రికెట్ ఆడతానని సురేశ్ రైనా అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడాల్సి ఉందన్నారు. రెండు కొత్త ఫ్రాంచైసీ జట్టు వచ్చాక నెక్స్ 2021-ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుందన్నారు. ఐపీఎల్లో ఆడితే సీఎస్కే జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పారు. 2021 సీజన్లో మెరుగ్గా ఆడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
2021-ఐపీఎల్ టోర్నీ 29 మ్యాచ్లు ఆడిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో వాయిదా వేశారు. ఇంకా ఈ లీగ్లో 31 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ లీగ్ మొదలైనప్పటి నుంచి చెన్నై ఫ్రాంచైసీ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ (40), సురేశ్ రైనా (34) ఆడుతున్నారు. 2016లో రెండేండ్ల పాటు సీఎస్కేను నిషేధించారు. దీంతో వారిద్దరూ వేర్వేరు టీమ్స్కు ప్రాతినిధ్యం వహించారు.
రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టులో ధోనీ, గుజరాత్ లయన్స్ టీంలో సురేశ్ రైనా ఆడారు. 2018లో సీఎస్కేను అనుమతించడంతో తిరిగి ఈ ఫ్రాంచైసీలో మరోసారి వారిద్దరూ అసోసియేట్ అయ్యారు. 2018 ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ టీం నాలుగు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.
2020 ఐపీఎల్ టోర్నీకి సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయ్యాడు. గతేడాది సీజన్లో చెన్నై టీం ఫ్లే ఆఫ్కు వెళ్లలేకపోయింది. ఇలా జరుగడం టోర్నీ చరిత్రలోనే ఫస్ట్ టైం.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి రైనాను తీసుకోకపోవచ్చునని వదంతులు వచ్చినా.. జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఏడు మ్యాచ్ల్లో సురేశ్ రైనా 123 పరుగులు చేశాడు. జట్టు ఏడు మ్యాచ్ల్లో ఐదింట విజయం సాధించింది.
గతేడాది ఆగస్టు 15న మహీంధ్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 15 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ధోనీ పలు విజయాలు సాధించారు.
2011 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఓడీఐ వరల్డ్ కప్-2011, ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2007 టైటిళ్లను సొంతం చేసుకున్నారు. ఇక ఐపీఎల్ టోర్నీలో నాలుగు సార్లు ధోనీ సారధ్యంలో చాంపియన్గా నిలిచింది ఈ సీఎస్కే టీం.
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్