మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా చిత్రం నుండి మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ .ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ చేతులో గన్లు పట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. పోస్టర్ మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.
ఈ సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఇందులో దేవాలయం సెట్ కోసం దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైదరాబాద్ శివారులోని కోకాపేట్లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ ఏర్పాటు చేయగా, వీటికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో ఏర్పాటు చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ జోడి కట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్ను విలన్గా మారుస్తున్న త్రివిక్రమ్
కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫన్ టైం- వీడియో వైరల్
విక్రమ్ వేధ హిందీ రీమేక్లో తలపడనున్న హృతిక్, సైఫ్!
సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజనిజాలేంటో చెప్పిన కమెడీయన్
నితిన్ రంగ్ దే రివ్యూ.. టైమ్పాస్ ఎంటర్టైనర్
ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగర్ మృతి