సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తం
సమస్యలపై సర్పంచ్లు, కార్యదర్శుల నజర్
గ్రామాల్లో అధికారుల తనిఖీలు
పల్లె ప్రగతి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
తనిఖీకి సీఎం రావొచ్చని సిద్ధం
వరంగల్రూరల్, జూన్ 20(నమస్తేతెలంగాణ): సీఎం కేసీఆర్ హెచ్చరికలతో అధికారులు గ్రామాల బాట పట్టారు. కొద్ది రోజుల నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటి స్తున్నారు. ఆకస్మిక తనిఖీలు జరిపి పల్లె ప్రగతి కార్యక్రమం పనులు, పచ్చదనం, పారిశుధ్యం, పంచాయతీల పనితీరు ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి హైదరాబాద్లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష స మావేశం నిర్వహించిన తర్వాత 16న మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, కమిషనర్లతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనుల్లో పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలని, అధికారులు నిరంతరం తనిఖీ లు నిర్వహించాలని చెప్పారు. అదన పు కలెక్టర్లు, డీపీవోలు ఆక స్మిక తనిఖీలతోపాటు పల్లెనిద్ర చేసి గ్రామాల్లోని సమస్యలు తెలుసుకోవాలని ముఖ్య మంత్రి భావిస్తున్నట్లు సీఎస్ తెలి పారు. ఈ నెల 17న జిల్లా కలెక్టర్ ఎం హరిత జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు, రాత్రి బస చేయ డం ద్వారా సమస్యలు తెలుసు కుని పరిష్కరించాలని ఆదే శించారు. దీంతో అధికారులు పల్లె దారి పట్టారు.
అప్రమత్తమైన అధికారులు, ప్రజాప్రతినిధులు
20వ తేదీ తర్వాత తాను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరపనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే పల్లె యం త్రాంగం అప్రమత్తమైంది. సర్పంచ్లు, గ్రామ కార్యదర్శు లు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, స్పెషల్ ఆఫీ సర్లు అలర్ట్ అయ్యారు. సర్పంచ్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ ఉదయమే గ్రామాల్లో ప్రత్యక్షం అవుతున్నారు. పారిశుధ్యంపై సిబ్బందితో మాట్లాడి సూ చనలు చేస్తున్నారు. సంబంధిత ఎంపీవోలు, ఎంపీడీవోలు ప్రతి రోజూ కొన్ని గ్రామాలకు వెళ్లి పారిశుధ్యం, నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్వ హణ పరిశీలిస్తున్నారు.
పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పను లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గ్రామా ల్లో గాకుండా వరంగల్ నగ రంలో ఉండే సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శు లు ఉదయం ఆరు గంటల వరకు గ్రామాల్లో ప్రత్యక్షం అవు తూ ఎక్కువ సమయం గ్రామాలకు కేటాయిస్తున్నారు. పం చాయతీ కార్యదర్శులైతే ఆకస్మిక తనిఖీలకు అధికారులు ఎవరెప్పుడొస్తారోనని సాయంత్రం వరకు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఈ నెల 21న వరంగల్ అర్బన్ జిల్లా పర్య టనకు వస్తున్న సీఎం కేసీఆర్ గ్రామాల ఆకస్మిక తనిఖీకి రావొచ్చని జి ల్లాలోని గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతు న్నా రు. వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న గీసుగొండ, దామెర మండలాల్లోని గ్రామాలకు సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో ఉన్న తాధికారులు అలర్ట్ అయ్యారు. గీసుగొండ మండలంలోని మరియపురం గ్రామంలో ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పా ట్లు జరుగుతున్నట్లు కూడా తెలిసింది.
ఆకస్మిక తనిఖీలు
అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, డీపీవో ప్రభాకర్ గ్రామా ల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి అదనపు కలెక్టర్ గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట, రాయప ర్తి, పర్వతగిరి, ఆత్మకూరు, దామెర తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ప్రతి రోజూ కనీసం ఐదు నుంచి ఎనిమిది గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామ పంచాయతీ నిర్వహణ, సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు, ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్పీవోల గ్రామాల సందర్శన, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన నర్సరీ, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డు, వైకుంఠదామం, హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీని పరిశీలించారు. ఆదివా రం కూడా ఆయన ఆత్మకూరు, దామెర మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డీపీవో ప్రభా కర్ కూడా కొన్ని మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్య టించారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు, పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు.