న్యూఢిల్లీ: 2048 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం దేశరాజధాని బిడ్ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ను రూపొందించామన్నారు. ‘విశ్వక్రీడల నిర్వహణ కోసం అవసరమైన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు చర్యలు ప్రారంభిస్తాం’ అని అసెంబ్లీలో కేజ్రీవాల్ మంగళవారం చెప్పారు. 2048 అనేది చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తున్నదని, కానీ ఒలింపిక్స్ కోసం పదేండ్ల ముందే బిడ్ వేయాల్సి ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో రెండుసార్లు ఆసియా క్రీడలు జరుగగా.. 2010లో కామన్వెల్త్ క్రీడలకు సైతం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.