ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో శనివారం వాంఖడే స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్..రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నైతో మ్యాచ్కు ఢిల్లీకి ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంకానున్నారు. సౌతాఫ్రికా పేస్ స్టార్లు రబాడా, అన్రిచ్ నోర్ట్జే ఆలస్యంగా జట్టులో చేరడంతో వాళ్లింకా క్వారంటైన్లోనే ఉన్నారు.
వీళ్లిద్దరితో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్తో పాటు ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.