వరంగల్ : కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ దవాఖాన(ఎంజీఎం)లో 800 పడుకలను ప్రత్యేకంగా కొవిడ్ బాధితుల కోసం కేటాయించాం. అందులో 650 పడుకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఎంజీఎం హాస్పిటల్ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు.
కొవిడ్ బాధితులో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని వైద్యులను కోరారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంజీఎంను ప్రత్యేకంగా కొవిడ్ బాధితుల కోసం కేటాయించామన్నారు. రోగుల చికిత్స కోసం కావాల్సిన మందులు, ఆక్సిజన్, నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు.
రెమిడిసివేర్ ఇంజక్షన్లు తెప్పిస్తున్నామని, కోవిడ్ బాధితులను ఎంజీఎంలో చికిత్స కోసం చేర్పించాలని కోరారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు నిస్వార్థంతో పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఎంజీఎంలో కొవిడ్ చికిత్స కోసం చేరిన కొందరు రోగులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
ఎంజీఎంలో అందరికీ ఉచితంగా మెరుగైన చికిత్స అందుతుందన్నారు.ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలు కొవిడ్ చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
ప్రైవేటు హాస్పిటల్స్లో వసూలు చేస్తున్న ఫీజులు, వైద్య సదుపాయాలను ఎప్పిటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమన్వయం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
అమెజాన్ సహాకారంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ 25 అక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి సమక్షంలో ఎంజీఎం దవాఖానకు అందజేశారు.
ఈ విపత్కర పరిస్థితిలో రాష్ట్రానికి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందించేందుకు ముందుకు వచ్చిన బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరీరెడ్డిని మంత్రి అభినంధించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం