టోక్యో: ఇండియన్ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఆమె అమెరికన్ ఆర్చర్ జెన్నిఫర్ ఫెర్నాండెజ్పై 6-4 తేడాతో గెలిచింది. ఐదు సెట్లపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దీపికా.. 2, 3, 5 సెట్లలో విజయం సాధించింది. నాలుగు సెట్ల తర్వాత ఇద్దరు ఆర్చర్లు నాలుగేసి పాయింట్లతో సమంగా నిలవగా.. నిర్ణయాత్మక చివరి సెట్లో దీపికా 26 స్కోరుతో ఫెర్నాండెజ్(25)ను వెనక్కి నెట్టి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది.