వార్సా: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన దీపక్ పునియా ఎడమ చేతి గాయం వల్ల పోలండ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. విశ్వక్రీడలు దగ్గరపడుతుండడంతో గాయం పెద్దది కాకుండా జాగ్రత్త పడేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. 86 కేజీల విభాగం క్వార్టర్స్లో జాహిద్ వలేన్సియా (అమెరికా)తో తలపడాల్సి ఉండగా.. గాయం వల్ల పునియా పోటీ నుంచి తప్పుకున్నాడు. వార్సాకు బయలుదేరే రెండు రోజుల ముందు ప్రాక్టీస్లో దీపక్కు గాయమైనట్టు సమాచారం.