ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతి
నివాళులర్పించిన నాయకులు, అధికారులు
కొల్లాపూర్, ఏప్రిల్ 5: దివంగత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం బాబూ జగ్జీవన్రాం 114వ జయంతి సందర్భంగా పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రాం చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని శ్రీలక్ష్మీవికాస్ సేవా సంస్థ నిర్వహిస్తున్న అంబలికేంద్రం వద్ద జగ్జీవన్రామ్ చిత్రపటానికి టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు కరీమొద్దీన్, 6వ వార్డు పార్టీ ఇన్చార్జి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చుక్కాయపల్లిలో టీఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు దేవనికుమార్ నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే బీరం పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యదర్శి రాఘవేందర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జాఫర్, టీఆర్ఎస్ నాయకులు ఖాదర్పాషా, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు వెంకటస్వామి, టీఎస్పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వరుడు, సింగిల్ విండో డైరెక్టర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్
అచ్చంపేట, ఏప్రిల్ 05: డివిజన్లోని అన్ని మండలాల్లో దళిత సంఘాలు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. అచ్చంపేట తాసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్ , మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీ పర్వతాలు, దళిత నాయకులు శంకర్మాదిగ, బాలరాజు, బాలరాజు, గోపాల్నాయక్, శివ, జైపాల్నాయక్, రమేశ్రావు, శ్రీరాములు, మల్లేశ్, సురేశ్, తిరుపతియాదవ్, రామకృష్ణ, బీమ్లా, శ్రీశైలం, పరమేశ్వర్, అంజి పాల్గొన్నారు.
నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే బీరం
కోడేరు, ఏప్రిల్ 5: అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబూ జగ్జీవన్రామ్ ఎంతో పాటుపడినట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డి, విండో చైర్మన్ చిన్నారెడ్డి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, ఏప్రిల్ 5: అమ్రాబాద్, పదర మండలాల్లో సోమవారం అధికారులు, నాయకులు జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయాలల్లో, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ రామస్వామి, దోమలపెంట టీఆర్ఎస్ నేతలు శివారెడ్డి, ప్రసాద్, ఎల్లయ్య, మల్లేశ్, తిరుపతయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 5: మండలంలోని అన్ని గ్రామాల్లో జగ్జీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలు అందించారని, ఆయన ఆశయ సాధనకోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో మల్లికార్జున్, వార్డు సభ్యులు డబ్బ ఎల్లయ్య ఉన్నారు.
జగ్జ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
లింగాల,ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయమని సర్పంచ్ కోనేటి తిరుపతయ్య అన్నారు. సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్మూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జయంతిని జరుపుకొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు ముక్తార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి మండలంలో..
పెంట్లవెల్లి, ఏప్రిల్ 5: మండలంలోని జటప్రోల్లోని ప్రధాన రహదారిలో ఉన్న అబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్రామ్ చిత్ర పట్టానికి గ్రామ సర్పంచు ఎస్కే ఖాజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాసులు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, ఏప్రిల్ 5: మండల కేంద్రం, వెల్టూర్, తాడూర్ తదితర గ్రామాల్లో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, కుర్మయ్య, లింగమయ్య, లక్ష్మయ్య, జంగయ్య, రమేశ్, నాగరాజు, ఖాదర్, బీజేపీనాయకులు పాల్గొన్నారు.